Tuesday 3 December 2013

వివాహ బంధం 

భార్యాభర్తల సంబంధం ఎట్లుండవలెనని మన పెద్దలు నిర్దేశించినారో  చూడండి :--

“వివాహ సమయంలో “సప్తపది” అనే తంతలో చదివే మంత్రాలలో 
ఒక మంత్రం :
“ సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం ,
సఖ్యాన్యే మయోష్టా:” 
అనగా ఈ ఏడడుగల బంధంతో భార్య, భర్తలమైన మనం ఇకపై 
స్నేహితులుగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని   విడవకుండా 
పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! “ఆపత్స మిత్రం జానీమః ” 
కష్టాలలో  ఆదుకొను వాడే మిత్రుడు. అట్టి మిత్రభావంతో భార్యాభార్తలు 
ఉంటే, వారి  మధ్య కలతలు, కార్పణ్యాలు , ఆవేశకావేశాలు, 
అసమానతలు  లేకుండా నిత్య వసంతంలా వారి  జీవితం 
సాగిపోతంది. ఇంకా—
“ సంతుష్టో  భార్యయా భర్తా భర్తా భార్య తధైవచ/
యస్మిన్నేవ కులేన్నిత్యం కల్యాణం తత్రవైధ్రువం ” అనగా 
భార్య ,భర్తలు  పరస్పరం ఒకర్ని ఒకరు గౌరవించుకొంటూ ప్రేమానురాగాలతో సంతుష్టంగా ఉంటారో |
ఆ ఇల్లు నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతుంది 

No comments:

Post a Comment